
అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తా
తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ పనులు
అభివృద్ధిలో కోడంగల్ రాష్ట్రానికి మోడల్ గా మారుస్తాం
సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోండి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర నలుమూలల నుంచి గొప్ప చదువులకోసం కొడంగల్ కు వెళ్లాలి అనేలా కొడంగల్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం.16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ గా కొడంగల్ ను మార్చాలని ప్రయత్నిస్తున్నాం.కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్ కళాశాలలు , ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చాం.మూడేళ్లలో కొత్త కోడంగల్ ను చూస్తారుకొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు .మూడేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేసి కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడుపుతాం.
ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బ్రతికేలా ఉండాలని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిత్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో సోమవారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ…
ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేపట్టాము.
రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాంమన్నారు.
అదానీ అంబానీలతో పోతే పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించాం
మహిళలకు ఆర్ధిక స్వాతంత్ర్యం కల్పించామని చెప్పారు. శిల్పారామంలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశామని,
ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకునేందుకు అమెజాన్ తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.
మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదువు అందించడం ఒక్కటే మార్గంముందున్నారం
మీ పిల్లలు గొప్పగా చదువుకుంటేనే మీ జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని సీఎం చెప్పారు
అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.






Leave a Reply