NewsInn

News in a Click

సర్పంచులుగా మంచి వ్యక్తులను ఎన్నుకోండి

సీఎం రేవంత్ రెడ్డి

పంచాయతీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందు కొడంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గానికి వరాలు కురిపించారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో కూడా ఎన్నికల వాతావరణం రాజు కుంటుండడంతో రాబోయే రోజు ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థుల్లో మంచివారిని ఎన్నుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వారిని మొదలుపెట్టిందన్న మొదలైంది. మరో రెండు మూడు రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సీఎం వ్యాఖ్యలు చేశారు. రేపటి మంత్రివర్గ సమావేశం సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వివిధ పథకాలకు నిధులను భారీగా మంజూరు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *