ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, దుబాయి లో హత్యకు గురైన ఒక తెలంగాణ కార్మికుడి భార్యకు ప్రభుత్వం నిర్మల్ జిల్లాలో ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ఇటీవల ఆమె హైదరాబాద్ లోని సీఎం ప్రవాసీ ప్రజావాణి లో, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ని కలిసి ఉద్యోగం ఇవ్వాలని వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో సీఎంఓ చొరవతో ఫైలు వేగంగా కదిలింది.

దుబాయి లోని ఒక బేకరీలో సహోద్యోగి అయిన ఒక పాకిస్తాన్ ఉన్మాది చేతిలో ఏప్రిల్ 11న కత్తిపోట్లకు గురైన నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు అష్టపు ప్రేమ్ సాగర్ భార్య ప్రమీల సోమవారం నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్ గా ఉద్యోగంలో చేరారు



Leave a Reply