NewsInn

News in a Click

ప్రతి డివిజన్ కు రూ.2 కోట్ల

జిహెచ్ఎంసి జనరల్ బాడీ తీర్మానం

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

హైదరాబాద్, నవంబర్ 26: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను అందించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి సాధారణ సమావేశం మంగళవారం ముఖ్యమైన తీర్మానం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక్కో వార్డు/డివిజన్‌కు రూ.2 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ఈ బడ్జెట్ కేటాయింపులో భాగంగా:
•రూ.1 కోటి — కార్పొరేటర్ ప్రత్యక్షంగా ప్రతిపాదించే పనులకు

•రూ.1 కోటి — జిల్లా ఇన్‌చార్జ్ మంత్రితో సమన్వయం చేస్తూ కార్పొరేటర్ ప్రతిపాదించే పనులకు మంజూరు చేయనున్నట్లు జిహెచ్ఎంసి స్పష్టంచేసింది.

ఈ నిధులను రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి కాల్వలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ సౌకర్యాల అభివృద్ధి వంటి అత్యవసర పౌర సదుపాయాల మెరుగుదలకు వినియోగించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *