NewsInn

News in a Click

నేటి నుంచి సిఎం సమీక్ష సమావేశాలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ -2025

డిసెంబర్​ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్​ 2047 డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దుతారు.​ ఈరోజు నుంచి నవంబర్​ 30 వరకు కమాండ్ కంట్రోల్​ సెంటర్​లో వరుసగా ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబు వరుసగా జరిగే అన్ని సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సమీక్షలో సంబంధిత మంత్రులు పాల్గొంటారు.

నవంబర్‌ 25- తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమిట్​ నిర్వహణ ఏర్పాట్లుసీఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొంటారు.

నవంబర్‌ 26 – లాజిస్టిక్స్‌, ఏర్పాట్లుసీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్కతో పాటు సంబంధిత అధికారులు.

నవంబర్‌ 27 – మౌలిక వసతులు, అభివృద్ధిసీఎంతో పాటు మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, మోహమ్మద్‌ అజరుద్దీన్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సంబంధిత విభాగాల అధికారులు.

నవంబర్‌ 28 – విద్య, యువజన సంక్షేమం*సాయంత్రం 4 గంటలకు సీఎంతో పాటు మంత్రులు వాకాటి శ్రీహరి, వివేక్‌ వెంకటస్వామి, సంబంధిత విభాగాల అధికారులు .

సాయంత్రం 6 గంటలకు:టూరిజం, టెంపుల్​ టూరిజం
మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ సంబంధిత అధికారులు

నవంబర్‌ 29 – వ్యవసాయం, సంక్షేమ విభాగాలు*సాయంత్రం 4 గంటలకు: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వాకాటి శ్రీహరి సంబంధిత అధికారులు.

సాయంత్రం 6 గంటలకు: మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ , సీతక్క , మోహమ్మద్‌ అజరుద్దీన్‌.

నవంబర్‌ 30 – ఆరోగ్య రంగం,సీఎంతో పాటు మంత్రి దామోదర్‌ రాజనరసింహ సంబంధిత అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *