ఆయుధాల విరమణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మూడు రాష్ట్రాల మావోలు మెట్టు మరో మెట్టు దిగారు. మూడు రాష్ట్రాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాల విరమణ తేదీని ప్రకటిస్తామని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రులకు విన్నవిస్తూ లేఖ రాసినట్టు తెలుస్తోందిఈ నిర్ణయంపై అంతర్గతంగా చర్చించుకునేందుకు, ఫిబ్రవరి 15వ తేది 2026 వరకు తమకు సమయం ఇవ్వాలని లేఖలో కోరినట్లు సమాచారం….అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మావోయిస్టులపై పై చేయి సాధించామన్న న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల ఆపరేషన్లకు కేంద్ర బిందువులుగా ఉన్న అడవుల పై పూర్తిగా పట్టు పట్టు సాధించినట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు కీలక నేతల వరుసగా లొంగిపోతుండడం, పోలీసు ఎన్కౌంటర్లలో హతం అవుతుండడంతో రూటు మార్చారన్న చర్చ కూడా మొదలైంది






Leave a Reply