నలుగురికి రిజర్వేషన్
స్టే విధించిన కోర్టు
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ఆ గ్రామంలో ఆరుగురు మాత్రమే ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఆ గ్రామంలో ఉన్న ఎస్టీల్లో నలుగురికి పది రోజులు వచ్చేలా రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఉప సర్పంచ్ పదవితోపాటు మూడు వార్డ్ మెంబర్లను ఎస్టీలకు రిజర్వ్ చేస్తూ అధికారులు రిజర్వేషన్ ల జాబితా విడుదల చేశారు.

ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన కొంతమంది కోర్టును ఆశ్రయించారు. అధికారుల రిజర్వేషన్ ప్రక్రియను పరిశీలించిన హైకోర్టు రిజర్వేషన్లను ఈ విధంగా ఎలా ఖరారు చేస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లు ఖరారు ఇదేం పద్ధతి అంటూ అధికారుల తీరును ప్రశ్నించింది. ఆరుగురు ఎస్టీ ఓటర్లు కూడా ఒకే వార్డులో ఉండడంతో మిగిలిన వార్డుల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారంటూ నిలదీసింది. ఇంతకీ ఆ గ్రామం ఏదంటే
మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.




Leave a Reply