లక్ష సీసీ కెమెరాలు అనుసంధానం
సీసీ కెమెరాల విరాళాన్ని కోరుతున్న పోలీసులు
నగరంలో EYES తో నిరంతరం నిఘా
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
హైదరాబాద్ మహానగర విస్తరణ రోజు రోజుకు పెరుగుతుండడం… నగరంలో క్రైమ్ రేట్ కూడా ఎక్కువగా ఉందన్న విమర్శలతో పోలీసు శాఖ సాంకేతికతను ఆధారంగా చేసుకుని హైదరాబాద్ మహానగరాన్ని నిఘా నీడలోకి తెస్తుంది. నగరం మొత్తంలో ఉన్న సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేసే విధంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున ఉన్నా అవి పనితీరు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. నేర సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు చేయడం లేదని ఎన్నో సందర్భాల్లో పోలీసులు తలలు పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నగరంలో హైదరాబాద్ నిఘ గ్రిడ్ ను ఏర్పాటుచేసి అన్ని పనిచేసేలా చర్యలు తీసుకునేందుకు నగర కమిషనర్ చర్యలు చేపట్టారు. దాదాపు లక్ష సీసీ కెమెరాలు నిర్వహణను సరికొత్త సాంకేతిక పద్ధతులతో అనుసంధానించడంతోపాటు…. సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలను పోలీసు శాఖ EYES (ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ) పేరుతో మొదలుపెట్టింది.

కీలకమైన నిఘా వ్యవస్థలు నిరంతరం పని చేయించడం EYES లక్ష్యం. అవసరమైన చోట్ల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం,నిర్వహించడం మొత్తం పరిధిని నిరంతరం పర్యవేక్షించే విధంగా అన్ని ఏర్పాట్లను పోలీస్ శాఖ చేసింది పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఉండడంతో వాటి నిర్వహణకు ప్రత్యేకంగా విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. నగరంలోని ప్రతి జోన్లో రెండు బృందాలు ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తూ ఉంటాయి.వీటికి అనుబంధంగానే ఓ మరమ్మతు కేంద్రాన్ని పోలీసు శాఖ ప్రారంభించబోతుంది.ఇది ఎప్పటికప్పుడు సాంకేతిక విశ్లేషణలను చేస్తూ మరమ్మతులను నిర్వహిస్తుంది. పరికరాల తయారీదారులతో సమన్వయంతో వారంటీ-సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతుంది.వీటి నిర్వహణకు భారీగా నిధులు అవసరం కానున్న నేపథ్యంలో నిధుల సమీకరణ కోసం ఒక ప్రత్యేక CSR డెస్క్ సృష్టించబడింది. HCSC (హైదరాబాద్ నగర భద్రతా మండలి)తో అనుసంధానించబడిన ఈ డెస్క్, సంస్థలు, పరిసరాలు మరియు వ్యాపారాలు హైదరాబాద్ను సురక్షితమైన నగరంగా మార్చడానికి నగరం యొక్క నిఘా మౌలిక సదుపాయాలకు నేరుగా సహకరించడానికి ప్రోత్సహించే “కెమెరాను దానం చేయండి – సురక్షితమైన వీధిని నిర్మించండి” వంటి ప్రచారాన్నీ మొదలు పెట్టనుంది.

ఇదో మైలు రాయి….సజ్జనార్
హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ మాట్లాడుతూ, ఐఈఎస్ (ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ) ప్రవేశపెట్టడం నగర భద్రతలో ఒక మైలురాయి అవుతుందని అన్నారు. ఈ విధానం పూర్తిగా నగరంలో శాంతిభద్రతలను కొత్త దిశలో తీసుకెళుతుందన్నారు. నగర భద్రత కోరుకునేవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలను విరాళంగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Leave a Reply