మూడు రీజియన్లుగా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి
తెలంగాణ రైజింగ్ 2047 సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ ఇన్)

తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్ లో కనిపించాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి ( CURE), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ ( PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ( RARE).. గా మూడు రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదు అని చాటి చెప్పేలా తెలంగాణ రైసింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్దికి గల అవకాశాలను వివరించటం, వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ఈ సమ్మిట్ ద్వారా ప్రకటించనుంది.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ తయారుచేశారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి , స్థిరమైన అభివృద్ధి — ఈ మూడు ప్రధాన రంగాలపై రాష్ట్ర అభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం ప్లాన్ చేసింది .అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పించారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో పనిచేస్తారు.రాష్ట్రంలోని ప్రతీ గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోంది





Leave a Reply