NewsInn

News in a Click

మావోయిస్టుల సంచలన లేఖ

జనవరి 1న లొంగిపోతాం

(హైదరాబాద్, న్యూస్ ఇన్)

మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిగా ఏరి వేస్తామని కేంద్రం చేసిన ప్రకటన…. ఆ తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. కీలక నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందగా…. మరి కొంతమంది నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు రెడీ అవుతున్నారు.కొద్దిరోజుల క్రితం ఆయుధం వీడెందుకు తమకు గడువు ఇవ్వాలని లేఖలో కోరిన మావోయిస్టులు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి ఒకటో తేదీన ఆయుధాలు వీడుతామని ప్రకటించారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో పలువురు మావోయిస్టు కీలక నేతలు హతం అయ్యారు. మరి కొంతమంది కీలక నేతలు లొంగిపోయారు. తాము ఆయుధాలను విడుతున్నట్లు ప్రకటిస్తూ జనజీవన స్రవంతిలో కలిసారు. మావోయిస్టుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ ఉండడంతో మిగిలిన మావోయిస్టులు కూడా పునరాలోచన చేసే పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ లేఖ విడుదల చేసింది. తాము జనవరి నాటికి లొంగిపోతామని ఆ లేఖలో పేర్కొంది. జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల అయింది.టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో బలహీనమైన మావోయిస్టు పార్టీ.దీంతో మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మార్చినాటికి టార్గెట్ పెట్టుకున్నా ఆ లోపే మావోయిస్టు రహిత దేశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *