(అమరావతి,న్యూస్ ఇన్)
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకులు,.భీమా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ వ్యవహార తీరుతో ఆగిపోయిన అమరావతి అభివృద్ధి పనులు ప్రధాని మోడీ మళ్ళీ ప్రారంభించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో బ్యాంకులో నిర్మాణం కోసం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారని రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం అని అన్నారు.

వీటి ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. అమరావతిని భారతదేశం గర్వపడేలా నిర్మాణం చేస్తామన్నారు.రాజధాని నిర్మాణం అంటే భవిష్యత్తులో అమరావతిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి రావాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు.








Leave a Reply