2018 ఖర్చులో మార్పులు లేవు
కమిషనర్ నాగిరెడ్డి పేరుతో ప్రకటన
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
రాష్ట్రంలో ఏడేళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అలసత్వంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థుల ఖర్చుల విషయంలో నియమ నిబంధనలపై పోటీ చేస్తున్న అభ్యర్థులకు అనుమానాలు ఉంటాయి. అధికారికంగా దీనిపై ఎన్నికల సంఘం నేడు ఒక ప్రకటన జారీ చేసింది. 2018 ఎన్నికల సందర్భంగా అప్పటి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జారీచేసిన ప్రకటనను మరోసారి ఎన్నికల సంఘం అధికారులు మీడియా కు విడుదల చేశారు. 2018 ఎన్నికలకు ఖరారు చేసిన ఖర్చులే 2025 పంచాయతీ ఎన్నికల్లోను వర్తిస్తాయని ఆ పత్రిక ప్రకటన సారాంశం. అయితే ఈ 2018 లో జారీ చేసినా ప్రకటనే 2025 లో కూడా వర్తిస్తుందని ఎన్నికల సంఘం నిర్ణయం. తరు మార్పులు ఏమీ లేకపోయినా కనీసం కొత్త ఎన్నికల కమిషనర్ పేరుతో కొత్త సర్కులర్ ను ఎన్నికల సంఘం జారీ చేయలేకపోయింది. పాత ఆదేశాలే అమలులో ఉంటాయని చెప్పదలుచుకున్నా దానికి అనుగుణంగా కొత్తగా మరో ప్రకటన ఎన్నికల సంఘం జారీ చేయాల్సి ఉంటుంది. 2018 నాటి ప్రకటననే మరోసారి విడుదల చేసి అధికారులు తమ అలసత్వాన్ని బయట పెట్టుకున్నారు. అయితే ఈ సర్కులర్ కి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసిందా లేదా అన్న అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రకటనతో పాటు కనీసం సవరణ పేరుతో కొత్త తేదీతో కూడా ప్రకటన విడుదల చేయలేని స్థితిలో ఎన్నికల సంఘం బిజీగా ఉందన్న జరుగుతోంది.ఈ ప్రకటన కాపీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ,సహా జిల్లా కలెక్టర్లు, మండల అధికారులు, రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపి చేతులు దులుపుకుంది








Leave a Reply