నకిలీ షేర్లు, వెబ్సైట్లు
స్క్రీన్ షాట్లతో నమ్మకం కలిగించిన కేటుగాళ్లు
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
షేర్ మార్కెట్ పై ఆసక్తి ఉన్న ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి వ్యక్తి సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ కు ఆకర్షితుడయ్యాడు.IIFl Capital పేరుతో ఉన్న లింక్ పై క్లిక్ చేశారు.మలక్పేటకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి మోసగాళ్ల చేతిలో 50 లక్షల రూపాయలకు పైగా నష్టపోయారు. నవంబర్ 2025 మొదటి వారంలో, IIFL క్యాపిటల్ పేరుతో ఫేస్బుక్లో ఒక ప్రకటన చూశానని పేర్కొన్నాడు.లింక్పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆ వ్యక్తి ఫోన్ కు వాట్సాప్ సందేశాలు వచ్చాయి. అందులో పంపిన వ్యక్తి తనను IIFL క్యాపిటల్ నుండి గోషన్ యాదవ్ అని పరిచయం చేసుకుని లాభదాయకమైన పెట్టుబడులు. IPO కేటాయింపుల కోసం మార్గదర్శకత్వం చేస్తానని చెబుతూ వచ్చాడు.

ఆ తర్వాత”IIFL CS ప్రీ-ఐపీఓ 067″ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు, అక్కడ సభ్యులు పెట్టుబడిదారులను ఆకర్షించడానికి లాభాలు మరియు షేర్ కేటాయింపుల నకిలీ స్క్రీన్షాట్లను పోస్ట్ చేస్తున్నారు. గ్రూప్ అడ్మిన్ల ప్రోత్సాహంతో, బాధితుడు మొదట ₹8,000 పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజులపాటు నమ్మించిన ఆ ఫేక్ ముఠా చివరికి నవంబర్ 25వ తేదీ నాటికి 51,23,000 పెట్టుబడి రూపంలో రాబట్టుకున్నారు. మోసగాళ్ళు తమ వెబ్సైట్లో గ్రో మరియు టెన్నిండ్ షేర్ల నకిలీ కేటాయింపులను చూపించారు, మొత్తం విలువ రు.1,30,58,899.80గా నమ్మించారు.

అతను నిధులను ఉపసంహరించు కోవాలనుకున్నప్పుడు, మోసగాళ్ళు అదనంగా ₹51,23,000 డిమాండ్ చేశారు. ఈ సమయంలో, బాధితుడు ప్రీ-ఐపిఓ పెట్టుబడుల ముసుగులో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ప్రఖ్యాత ఆర్థిక సంస్థల పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ ప్రకటనలను సృష్టిస్తున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


Leave a Reply