టికెట్ల అమ్మకాలు ప్రారంభం
(స్పోర్ట్ డెస్క్, న్యూస్ ఇన్)
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియేనెల్ మెస్సీ తన భారత దేశ పర్యటన గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు తన టూర్ లో హైదరాబాద్ ఖరారు కావడాన్ని మెస్సీ ప్రస్తావించారు. కోల్ కత్త, ముంబాయి, ఢిల్లీలో కూడా మెస్సీ పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. రాక కోసం తాను ఎదురు చూస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంతో ప్రతి ఫుట్ బాల్ అభిమాని ఎంతో ఆతృతగా ఉంటారన్నారు. మెస్సీకి ఈ గడ్డపై ఘన స్వాగతం పలికేందుకు తాము ఎంతో ఆసక్తితో ఉన్నామన్నారు. కోల్ కత్త, ముంబాయి, ఢిల్లీలో కూడా మెస్సీ పర్యటిస్తున్నట్లు తన ట్విట్టర్ హ్యాండిల్ లో వెల్లడించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి.రు.1750 నుంచి 30 వేల వరకు టికెట్ల ధరను నిర్ణయించారు. డిస్ట్రక్ట్ జొమాటో యాప్ లో టికెట్ల అమకాలు మొదలయ్యాయి. మెస్సి తోపాటు భారత క్రికెటర్లు కోహ్లీ, గిల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో ఇటు క్రికెట్ అటు ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ క్రీడాకారులంతా ఒకే చోట ఒకే వేదికపై కి వస్తుండడం హైదరాబాద్ తో ప అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది



Leave a Reply