మెస్సీతో ఫుట్ బాల్ అడనున్న రేవంత్ రెడ్డి
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ భారత దేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ, ముంబాయి, కోల్ కత్తా లతో పాటు హైదరాబాద్ కు మెస్సీ పర్యటన ఖరారైంది. దీంతో ప్రభుత్వం మెస్సీ పర్యటనను విజయవతం చేసేందుకు అనుసరించాల్సిన అంశాలపై దృష్టి పెట్టింది. ప్రముఖ క్రీడాకారుడు హైదరాబాద్ వస్తుండడంతో... ప్రభుత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా కార్యచరణ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్13 వ తేదీన లియెనల్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఫుట్ బాల్ ఆటకు సింబాలిక్ గా కొద్దిసేపు మెస్సీ ఫుట్ బాల్ అడనున్నారు.

ఈ మ్యాచ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా రంగంలోకి దిగేందుకు రెడీ అవుతన్నారు.మెస్సీ నం. 10 జెర్సీతో గ్రౌండ్ లో అడుగు పెడుతుంటారు. అదే అనవాయితీగా ఇక్కడా మెస్సీ 10వ నంబర్ జెర్సీతో ఫుట్ బాల్ అడనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెగ్గులర్ గా ఫుట్ బాల్ అడే అలవాటు ఉంది. రోజు ఫుట్ బాల్ అడే సీఏం మెస్సీ రంగంలోకి దిగుతున్న సమయంలో మెస్సీ తో పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత బిజీ షెడ్యూల్ కారణంగా గతంలో మాదిరిగా ఫుట్ బాల్ అడేందుకు సిఎం సమయం కేటాయించలేకపోతున్నారు. తనకు ఫుట్ బాల్, హాకీ క్రీడలంటే ఇష్టమని చెప్పే రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ లో ఢీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రేవంత్ తన లక్కీ నంబర్ 9వ నంబర్ జెర్సీతోనే ఫుట్ బాలే అడనున్నట్లు తెలుస్తోంది. మెస్సీతో పాటు ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుబ్ మన్ గిల్ కూడా హైదరాబాద్ పర్యటనలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఈవెంటను ప్రతిష్టత్మకంగా నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణాకు గుర్తింపు తెచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తుండడంతో దీనికి అనుబంధంగా మెస్సీ పర్యటనను ప్రభుత్వం ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది.









Leave a Reply