NewsInn

News in a Click

కార్తీక దిపోత్స‌వం – ప్రత్యేక రైళ్లు

తిరువాణ‌మ‌లై భ‌క్తులకు అందుబాటులో

(హైద‌రాబాద్, న్యూస్ఇన్)

తిరువణ్ణామలై కార్తీక దీపం సందర్భంగా ఈ నెల 3, 4 తేదీల్లో దక్షిణ రైల్వే 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 24న ప్రారంభమైంది. కార్తీక‌దిపోత్స‌వం సంద‌ర్భంగా దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు ప‌ది రోజుల‌పాటు ప్ర‌త్యేకంగా పూజ‌లు నిర్వ‌హిస్తారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు.మహా దీపం వెలిగించే రోజున ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తిరువాణ్ణ‌మ‌లై చేరుకుంటారు.

ఈ ఏడాది దాదాపు 40 లక్షలకు పైగా భక్తులు రానున్నట్లు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేస్తోంది. తిరువాణ్ణ‌మ‌లై చేరుకునేందుకు ఈ ఏడాది ప్రత్యేక రైళ్లు, ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సంవత్సరం మరిన్ని రైళ్లు నడపాలని రైల్వే శాఖ‌కు జిల్లా ఎంపీ సి.ఎన్. అన్నాదురై లేఖ రాశారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించి 15 రైళ్లు న‌డిపేందుకు ఏర్పాట్లు చేసింది.తిరువాణ్ణ‌మ‌లై( అరుణాచ‌లం) చేరుకునే రూట్ల‌లో ఈ రైళ్ల‌ను న‌డించ‌నున్నారు.
15 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకటించింది:
తిరునెల్వేలి → తిరువణ్ణామలై: 2 రైళ్లు
చెన్నై ఎగ్మోర్ → తిరువణ్ణామలై: 2 రైళ్లు
విల్లుపురం → తిరువణ్ణామలై: 8 రైళ్లు
విల్లుపురం → తిరువణ్ణామలై → వెల్లూరు: 6 రైళ్లు
తాంబరం → తిండివనం → తిరువణ్ణామలై: 4 రైళ్లు అదనంగా న‌డిపించనున్నారు.
అన్ని సాధారణ రైళ్లు కూడా 3 మరియు 4 తేదీల్లో యథావిధిగా నడుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *