సీఏం రేవంత్ రెడ్డి సమీక్ష
(హైదరాబాద్,న్యూస్ఇన్)
భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా తాము రూపొందించే విజన్ డాక్యుమెంట్ ఉండబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించారు.ప్రముఖులకు అందించే ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సమ్మిట్ ను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సిఎం చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సీఏం గ్లోబల్ సమ్మిట్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు రూపొందిస్తున్న విజన్ డాక్యుమెంట్ ను సంబంధిత మంత్రులు శాఖల వారిగా పరిశీలించి ఖరారు చేయాలని సూచించారు


గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవష్యత్ తరాల కోసం పాలసీని జాతికి అంకితం చేస్తామని సీఏం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారురాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

నీతి అయోగ్,ఐఎస్ బీ లాంటి సంస్థల సహకారంతో డాక్యూమెంట్ ను తయారు చేస్తున్నాం.. ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామన్నరు.రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ హైవే, బుల్లెట్ ట్రైన్ లు రాబోతున్నాయన్నరు. అందరికి విద్య అందుబాటులో ఉన్నప్పటికి నాణ్యమైన విద్య , సాంకేతిక విధ్య అందుబాటులో లేదని సీఏం అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్కోసం ప్రజా భవన్ లో వార్ రూం ఏర్పాటు చేస్తున్నామన్నారు.



Leave a Reply