(అమరావతి, న్యూస్ఇన్)
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతున్న తీవ్రవాయుగుండం.

మధ్యాహ్నానంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ప్రకటించింది.
ఈ ప్రభావంతోనెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉంది.
కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణకోస్తా తీరం వెంబడి 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.




Leave a Reply