(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ఈనెల 13వ తేదీన ప్రముఖ క్రీడాకారుడు లియోనల్ మెస్సి హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మెస్సి ఫుట్ బాల్ ఆడేందుకు కొద్దిసేపు సమయం కేటాయించారు. మెస్సితో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రి కాకముందు రోజు ఫుట్ బాల్ ఆడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడంతో ఫుట్ బాల్ ఆడలేక పోతున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు హైదరాబాద్ వస్తుండడంతో ఆయనతో ఫుట్ బాల్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. మంత్రులతో సమీక్ష ముగిసిన అనంతరం ఆదివారం నేరుగా ఫుట్బాల్ గ్రౌండ్ కు వెళ్లి కొద్దిసేపు ప్రాక్టీస్ చేశారు. మరి కొన్ని రోజులు కూడా ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏంసిఆర్ హెచ్ఆర్డిలో లో సీఎం రేవంత్ క్రీడాకారులతో కలిసి ఫుట్ బాల్ ఆడారు. రేవంత్ రెడ్డి మెస్సితో పోటీపడేందుకు రెడీ అంటూ సోషల్ మీడియాలో సీఎం అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.




Leave a Reply