ఏ ఐ ఏ డి ఎం కే బహిష్కరణ
ఓపీఎస్ ను కలిస్తే… ఇపిఎస్ కు కోపం
(న్యూస్ఇన్, డెస్క్)
తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికలు అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంగా టీవీకే అధినేత విజయ్ పావులు కదుపుతున్నారు. ఏఐఏడీఎంకెలో జరుగుతున్న పరిణామాలు తనకు అనుకూలంగా మలుచుకునేలా చక్రం తిప్పుతున్నారు. పళని స్వామి పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సెంగోట్టయన్ ను పలని స్వామి బహిష్కరించడంతో…. టీవీకే పార్టీ ఆయనను చేర్చుకుంది.

తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పార్టీలో విధేయుడుగా పనిచేసిన ఆ నేతపై ఏఐఏడీఎంకే బహిష్కరణ వేటువేసింది. రాజకీయంగా దాదాపు అరశతాబ్దం అనుభవమున్న అలాంటి నేతను మరో రాజకీయ పార్టీ వదులుకుంటుందా…. వెంటనే తమ పార్టీ లో చేర్చుకుని ప్రాధాన్యత కలిగిన పదవిని కట్టబెడతామని ప్రకటించింది.సెంగొట్టయన్ స్వాతంత్ర సమరయోధుడు,ఆధ్యాత్మిక నాయకుడు పసుంపొన్ ముత్తురామలింగం తో పాటు. తేవర్ జయంతి నాడు ఎఐఎడిఎంకె వర్గ నాయకులు ఓ. పన్నీర్ సెల్వం (ఓపిఎస్) మరియు టి.టి.వి. దినకరన్లను కలవడమే సంగొట్టయన్ కలువడమే ఏ ఐ ఏ డి ఎం కే ప్రధానకార్యదర్శి ఇపిఎస్ కు కోపం తెప్పించింది.




Leave a Reply