జనగణన సమాచారం …..పార్ట్ –1
(హైదరాబాద్,న్యూస్ఇన్)
భారత దేశంలో ప్రతి పదేళ్లకు ఒక సారి జనగణన చేస్తారని మాత్రమే అందరికీ తెలిసిన విషయం…జనగణన ఎప్పుడు మొదలు పెట్టారు. జనగణన తో ఎలాంటి ఉపయోగాలు….జనగణణ వల్ల ప్రయోజనాలు ఏమిటన్నది మాత్రం విద్యావంతులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవచ్చు. పదేళ్లకు ఒక సారి నిర్వహించే జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఒక శాఖ నే దేశ వ్యాప్తంగా పనిచేస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ శాఖను పర్యవేక్షిస్తోంది. జనగణన సందర్భంగా దేశంలో ఉన్న జనాభా ను మొత్తం లెక్కించడమే లక్ష్యం. గతంలో జనగణన కోసం కనీసం ఏడాది సమయం తీసుకునేది కానీ నేడు జనగణనకు ఆ స్థాయిలో సమయం తీసుకునే చాన్స్ లేదు.. డిజిటలైజేషన్ అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం డిజిటలైజేషన్ ప్రక్రియతో దీన్ని సులువుగా మార్చేలా చట్ట సవరణ చేసింది.

1872 లో తొలిసారి దేశంలో బ్రిటిషర్లు జనగణన చేశారు. కానీ దేశ వ్యాప్తంగా ఒకే సారి ఆ జనగణణ జరుగ లేదు. ఒక్కో ప్రాంతంలో, రాష్ట్రంలో ఒక్కో సారి జనగణణ జరిగింది.1881 లో తొలిసారి జనగణను దేశ వ్యాప్తంగా చేసిన ఒకే చోటికి చేర్చడం మొదలు పెట్టారు. బ్రిటిష్ హాయంలో మొదలైన జనగణన అలా జరుగగా దేశానికి 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత 1951 నుంచి భారత ప్రభుత్వం జనగణన అధికారికంగా మొదలు పెట్టింది. ఆ తరువాత ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన ప్రక్రియ లో భాగంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తోంది.
సమచార హక్కు పరిధిలోకి రాదు….
జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలను అమలు చేయాల్సి ఉంటుంది. చట్ట బద్దత కల్పించిన తరువాతే పౌరలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించనుంది. ఈ సమాచారం మొత్తం పూర్తి గోప్యంగా ఉంచడం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కీలక నిర్ణయం. జనగణనకు సంబంధించి సమాచారం ఇతరులకు ఇవ్వకుండా ఆర్టీ ఐ చట్టం నుంచి సెన్సస్ కు మినహాయింపు ఇచ్చింది. ఈ విడత జనగణనకు ప్రభుత్వం గత జూన్ లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు అధికార యంత్రాంగం జనగణనలో పాల్గొననుంది. ఇందుకోసం వచ్చే సిబ్బందకి క్షేత్ర స్థాయి వరకు వెళ్లే వారికి ప్రభుత్వం శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. జనగణనలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా చట్టరీత్యా నేరంగా పరిగణించే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారం సమచారం ఇవ్వని వ్యక్తులకు జరిమానా విధించేలా చట్టం ఉంది.

పేపర్ లెస్ జనగణన….
ఈ సారి డిజిటలైజేషన్ లో భాగంగా చేపడుతున్న జనగణలో కేంద్ర ప్రభుత్వం ఓ యాప్ ఎన్యుమరేటర్లకు ఇచ్చి ఆ యాప్ లో నిర్దేశిత ఫార్మాట్ లో సమాధానాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. స్వయంగా కూడా జనగణలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఇది ఫైనల్ కాదు…. స్వయంగా నమోదు చేసుకున్నా…సంబంధిత నివాస ప్రాంతంలో ఎన్యుమరేటర్ వచ్చి ఆ సమాచారం ఖరారు చేసుకున్న తరువాత జనగణన పూర్తియినట్లు పరిగణిస్తారు.
రేపు ఇదే సమయానికి జనగణనపై మరింత సమాచారం …..పార్ట్ -2








Leave a Reply