NewsInn

News in a Click

ర‌వీంద్ర భార‌తిలో ఉగాది వేడుక‌లు

ర‌వీంద్ర భార‌తిలో ఉగాది వేడుక‌లు

హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

రాష్ట్ర ప్ర‌భుత్వం తెలంగాణా భ‌వ‌న్లో ఉగాది వేడుకుల‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా డిప్యూటీ సీఎం భ‌ట్టి, పీసీసీ చీఫ్ మ‌మేష్ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, పంచాగ శ్ర‌వ‌ణం పండితులు చేశారు. అనంత‌రం సీఎం రేవంత్ మాట్టాడారు..

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్………..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాఒ

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నాం

దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణం

తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే

అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం

18 వేల కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు చేశాం

ఈ నెల 22 న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నాం

రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం క‌ట్ట‌బడి ప‌నిచేస్తోంది.

ధరణి భూతాన్ని తరిమేసి భూ భారతితో భూసమస్యలను పరిష్కరిస్తున్నాం

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం

ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది

ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా

27న భ‌ద్రాచ‌లంలో క‌ళ్యాణానికి ఆహ్వానం…..

ఈ నెల 27వ తేదీన భ‌ద్రాచ‌లంలో జ‌రిగే రాముల వారి క‌ళ్యాణ‌త్స‌వానికి హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని నివాసంలో కిసి మంత్రి కొండ‌సురేఖ‌, దేవాదాయ శాఖ డైరెక్ట‌ర్ హ‌నుమంత‌రావ్, ఆల‌య అర్చ‌కులు దామోద‌ర్ రావులు క‌లిశారు. ఈ నెల 19వ తేదీ నుంచి తిరు క‌ళ్యాణోత్స‌వాలు జ‌రుగుతాయ‌ని అర్చ‌కులు తెలిపారు.

మూసీ పై భ‌ట్టి చెప్పిన వాస్త‌వం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *