NewsInn

News in a Click

నగర వ్యాప్తంగా GHMC సేఫ్టీ డ్రైవ్

న‌గ‌రంలో 23 వేల గుంతల గుర్తింపు

(హైదరాబాద్, న్యూస్ ఇన్)

  గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు భారీ ఎత్తున గుంట‌లు ఏర్ప‌డ్డాయి. కొన్ని నెల‌ల పాటు వాటిని ప‌ట్టించుకోని గ్రేట‌ర్ అధికారులు వాటిని పూడ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌ర వ్యాప్తంగా 23 వేల‌కు పైగా గుంట‌లు ఏర్ప‌డ్డాయ‌ని ప్రాథ‌మికంగా గుర్తించిన అధికారులు వాటిని మూసే ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టారు. ప్ర‌ధాన ర‌హ‌దారులు సహా ఇంట‌ర్న‌ల్ ర‌హ‌దారుల్లో కూడా గుంట‌లు పెద్ద ఎత్తున ఏర్ప‌డ్డాయి. ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై ఈ గుంట‌ల కార‌ణంగా ట్రాఫిక్ జాం లు ఏర్పాడుతున్నాయి. గ్రేట‌ర్ అధికారులు చేప‌ట్టిన ఈ సేప్టీ డ్రైవ్ ద్వారా న‌గ‌రంలో ప్ర‌యాణం కూడా సౌక‌ర్య వంతంగా మార‌నుంది.

రోడ్డు భద్రత చర్యలలో భాగంగా గుంతల పూడ్చివేత పనులు, క్యాచ్ పిట్ రిపేర్‌లు, రోడ్ల మరమ్మత్తు పనులు, ప్యాచ్ వర్క్ పనులు, కవర్ రీప్లేస్‌మెంట్‌లు, సెంట్రల్ మీడియన్ మరమ్మతులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాల మేరకు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు డ్రైవ్ ను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.నవంబర్ 28వ తేదీ నాటికీ నగరంలో మొత్తం 22,797 గుంతలు గుర్తించి వాటిలో 21,511 గుంతలకు మరమ్మతులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,019 క్యాచ్ పిట్స్ రిపేర్‌లు, 494 కవర్ రీప్లేస్‌మెంట్‌లు, 13 సెంట్రల్ మీడియన్ మరమ్మతులు పూర్తి అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *