
సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది తమ ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తున్నారు.రోజు ఏదో ఏక చోట మనం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో లైక్ లు, ఫాలోవర్ల కోసం కొంత మంది తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.
ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్లు ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా, ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయ. ప్రజాదరణ కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఇటీవలి వీడియోలో ఇలాంటి దృశ్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి రైల్వే బ్రిడ్జిపై చేసిన విన్యాసాలు ఆందోళన రేపాయి.
.వీడియోలోని యువకుడు కొన్నిసార్లు తలక్రిందులుగా, కొన్నిసార్లు వంతెన పైన వ్యాయామం చేస్తున్న దృష్యాలు అందరిలోనూ అయోమయానికి గురి చేసాయి. ఇలాంటి సందర్భాల్లో చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రాణాంతకం కావచ్చని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ వీడియోను పోస్ట్ చేసిన యూజర్ రైల్వే బ్రిడ్జిపై చిత్రీకరించిన రెండు వేర్వేరు క్లిప్లను షేర్ చేశాడు. ట్రాక్ల మధ్య నిలబడి వ్యాయామాలు చేస్తున్నట్లు కనిపించింది. రైల్వే ట్రాక్ దాటి వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించే జనం ఉన్నా….ఆ యువకుడు రైల్వే ట్రాక్ మద్యలో స్టంట్లు చేస్తున్నారు.
రెండవ వీడియోలో బ్రిడ్జి నుండి వేలాడుతూ జిమ్లో పుల్-అప్లు చేసారు. ఈ బ్రిడ్జి కింద లోతైన లోయ కూడా ఉంది ఈ సమయంలో పట్టు తప్పితే పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పుతాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ యువకుడు చేసిన ఫీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇలాంటి స్టంట్లు చేస్తున్న వారి ఆత్మ విశ్వాసం ఉన్నా…… ఏ క్షణంలోనైనా ప్రాణాంతకం కావచ్చు
వీడియోను ఇక్కడ చూడండిః
View this post on Instagram
ఈ సంఘటన జరిగిన ప్రదేశం, సమయం అస్పష్టంగా ఉంది. వీడియోలు ఎప్పుడు.. ఎక్కడ చిత్రీకరించారో తెలియనప్పటికీ, రెండు రీల్స్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అనేక మంది వీటిని వీక్షించారు. ఇటువంటి వీడియోలు తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగించవచ్చు, కానీ అవి కలిగించే ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రైల్వే ట్రాక్లు, వంతెనలు ప్రయాణీకుల కదలిక కోసం నిర్మించబడ్డాయి. ఏ రకమైన విన్యాసాల కోసం కాదు. స్వల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. స్టంట్ పెర్ఫార్మర్కే కాదు, రైలులో ప్రయాణించే వందలాది మంది ప్రయాణికులకు కూడా..!
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






Leave a Reply