NewsInn

News in a Click

పీ ఏం ఓ పేరు ఇక సేవాతీర్థ్

రాజ్ భ‌వ‌న్ ఇక లోక్ భ‌వ‌న్

( హైద‌రాబాద్, న్యూస్ ఇన్)
దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి ఇంకా బ్రిటిష్ వారి పాల‌న ప్ర‌భావం పూర్తిగా పోలేదు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లో, పాల‌న‌లో అవే నిబంధ‌న‌లు, అవే పేర్లు అమ‌లు అవుతున్నాయి. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా దాదాపు అవే అమ‌లు చేస్తూ వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భ‌త్వం ఓ కీల‌క నిర్ణ‌యం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యాన్ని (పీఎం ఓ) అని, గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యాన్ని రాజ్ భ‌వ‌న్ అని తో స‌హా రాజ్ భ‌వ‌న్ ల అనే పేర్ల ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రి నోళ్ల‌లో నానాయి. ఇక క్ర‌మంగా వాటి ఆన‌వాళ్ల‌ను చెరిపేసే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యాన్ని ఇక పై సేవాతీర్థ్ గా మారుస్తున్న‌ట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇక పీఎం ఓ స్థానంలో సేవాతీర్థ్ గా అమ‌లు కానుంది. ఇక దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రల్లో గ‌వ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ల కార్యాల‌యాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్ భ‌వ‌న్ అని పేరు, గ‌వ‌ర్న‌ర్ లు ఉండే నివాసాన్ని రాజ్ నివాస్ అని పిలుస్తుండే వారు. ఇక‌పై వాటి పేర్లు కూడా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

రాజ‌భ‌వ‌న్ స్థానంలో ఇప్ప‌టి నుంచి లోక్ భ‌వ‌న్ అని రాజ్ నివాస్ అనే స్థానంలో లోక్ నివాస్ అనే పేర్లు అమ‌లులోకి వ‌చ్చాయి.. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌తో హైద‌రాబాద్ లో రాజ్ భ‌వ‌న్ పేరు మారుస్తూ బోర్డును లోక్ భ‌వ‌న్ కార్యాల‌య వ‌ర్గాలు ఏర్పాటు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *