తెలంగాణా పోలీసు శాఖ
సైబర్ మోసాలపై అవగాహన
(హైదరాబాద్, న్యూస్ఇన్ )
సైబర్ మోసాలు రోజు రోజుకు పెరుగుతుండడంతో తెలంగాణా పోలీసులు ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.డీజీపి శివధర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూంలో ఈ కార్యక్రమాన్ని బ్యాంకు అధికారులతో కలిసి స్టార్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా సైబర్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఈ సగటుతో పోలిస్తే తెలంగాణాలో సైబర్ నేరాల సగటు తక్కువగా ఉందన్నారు. రోజుకు సగటున 1200 మంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతూ కాల్ సెంటర్ ఫోన్ చేస్తున్నారని వెల్లడించారు.

రోజుకు నాలుగు కోట్ల రుపాయాలు సైబర్ నెరగాళ్ల తెలంగాణా ప్రాంతం నుంచి కొల్లగొడుతున్నారన్నరు.ఇటీవల జరిగిన రెండు మూడు సైబర్ మోసాలను శివధర్ రెడ్డి వివరించారు. అప్రమత్తంగా ఉండడమే సైబర్ నేరాల అరికట్టేందుకు మనం అప్రమత్తంగా వ్యవహరించడే పరిష్కారమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహనకల్పించేందుకు పోలీసు శాఖ ఆరు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమే ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సీఐడి డిజీ శిఖా గోయోల్ అన్నారు. కార్యక్రమానికి హాజరైన వారితో డీజీ సైబర్ నేరాల అవగాహనపై ప్రతిజ్ఙ చేయించారు.





Leave a Reply