టీయూడబ్ల్యూజే
(హైదరబాద్, న్యూస్ ఇన్)
తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా నిర్లక్ష్యానికి, నిరాధరణకు గురవుతున్న పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ వద్ద ఉదయం 10 గంటలకు ఈ ధర్నా ప్రారంభమవుతుందని చెప్పారు.

మంగళవారం బషీర్ బాగ్ లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరాహాత్ అలీ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాత్రికేయులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. పోరుబాట పడతామని హెచ్చరించారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాత్రికేయుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొంటారని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొంటారని చెప్పారు. అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Leave a Reply