NewsInn

News in a Click

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భారీగా న‌మోదు

ముగిసిన న‌మోదు ప్ర‌క్రియ‌

డిప్ ద్వారా మంగ‌ళ‌వారా కేటాయింపు

(అమ‌రావ‌తి, న్యూస్ఇన్)

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆన్ లైన్ లో న‌మోదు చేసుకున్నారు. టీటీడి 1.8. ల‌క్ష‌ల టోకెన్ల‌ను ఆన్ లైన్ల్లో కేటాయించేందుకు ఏర్పాట్లు చేయ‌గా దాదాపు 25 ల‌క్ష‌ల మంది త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఒక‌టో తేదీ సాయంత్రం వ‌ర‌కు భ‌క్తుల న‌మెదుకు టీటీడి అనుమ‌తి ఇచ్చింది.డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1….ఈ 3 రోజులకు ఆన్‌లైన్ లో ఈ-డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకన్లు కేటాయింపు.రేపు నిర్వహించే ఈ-డిప్ లో ఎంపికైన భక్తులకు ఆన్‌లైన్ లో టోకన్లు కేటాయిస్తారు.

మొత్తం మూడు ఆన్ లైన్ వేదిక‌ల ద్వారా భ‌క్తుల త‌మ పేర్ల‌ను టీటీడి లో న‌మోదు చేసుకున్నారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకోగా టీటీడీ వెబ్ సైట్ లో 9.3లక్షలు, ఏపీ గవర్నమెంట్ వాట్స్ యాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తుల పేర్లు నమోదయ్యాయి. మొత్తం ప‌ది రోజుల పాటు వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాలు టీటీడి ఏర్పాటు చేసింది. మిగిలిన ఏడురోజులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం యథాతథంగా నిర్వ‌హించ‌నుంది. ఇందుకు గానుచివరి 7 రోజుల్లో రోజుకు 15వేల రూ 300 దర్శనం టిక్కెట్లు, రోజుకు వెయ్యి శ్రీవాణి టిక్కెట్లు….డిసెంబర్ 5వ తేదీ ఆన్లైన్ లో అందుబాటులోకి రానున్నారు. చివరి 3 రోజులు జనవరి 6,7,8 తేదీల్లో స్థానికుల కోసం….రోజుకు 5వేల టోకన్లు డిసెంబర్ నెల 10 వ తేదీ విడుదల చేయ‌నున్నారు. సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టీటీడీ ఏర్పాట్లు చేసేందుకు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *