NewsInn

News in a Click

10 వ తేదీన ఓయుకు సీఎం రేవంత్

10 వ తేదీన ఓ.యూ.కు సీఎం రేవంత్ రెడ్డి

అభివృద్ధి ప‌నుల‌పై నెలాఖరుకు తుది నిర్ణ‌యం

ఓయూ అభివృద్ధి పై సీఎం ఎ.రేవంత్ రెడ్డి

(హైదరాబాద్,న్యూస్ఇన్)

హైద‌రాబాద్‌: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో (ఓయూ) చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఈనెల 10వ తేదీన మరోసారి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై తొలుత అధికారులు సీఎంకు వివ‌రించారు. అనంత‌రం ప‌నుల‌కు సంబంధించిన వివిధ మోడ‌ళ్ల ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్స్‌ను సీఎం వీక్షించారు.

హాస్ట‌ల్ భ‌వ‌నాలు, ర‌హ‌దారులు, అక‌డ‌మిక్ బ్లాక్స్‌, ఆడిటోరియం నిర్మాణాల‌కు సంబంధించి ప‌లు మార్పులు చేర్పుల‌ను సీఎం సూచించారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో ప‌నుల‌కు అర్బ‌న్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను సీఎం సూచించారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఇప్ప‌టికే ఉన్న జ‌ల వ‌న‌రుల‌ను సంర‌క్షిస్తూనే నూత‌న జ‌ల వ‌న‌రుల ఏర్పాటుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. హాస్ట‌ల్‌, అక‌డ‌మిక్ భ‌వ‌నాల నిర్మాణం విష‌యంలో వంద మంది విద్యార్థులుంటే అద‌నంగా మ‌రో ప‌ది శాతం విద్యార్థుల‌కు వ‌స‌తులు ఉండేలా చూడాల‌ని సీఎం తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భ‌విష్య‌త్తులోనూ ఎటువంటి అసౌక‌ర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాల‌ని సీఎం అన్నారు.

ఉస్మానియా యూనివ‌ర్సిటీ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ఎంత మొత్త‌మైనా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని చారిత్ర‌క, వార‌స‌త్వ భ‌వ‌నాల‌ను సంర‌క్షించాల‌ని సీఎం సూచించారు. చారిత్ర‌క ప్రాధాన్యం లేని పురాత‌న‌ భ‌వ‌నాల‌కు భారీ మొత్తాలు వెచ్చించి మ‌ర‌మ్మ‌తుల‌కు చేసే బ‌దులు నూత‌న భ‌వ‌నాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం సూచించారు. సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్‌లతో పాటు ప్ర‌తి ప‌నిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాల‌ని సీఎం తెలిపారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్ర‌తిమ‌ను ప్ర‌తిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు.

ఉస్మానియా యూనివ‌ర్సిటీని ఈ నెల 10వ తేదీన సంద‌ర్శించనున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక‌డ‌మిక్ బ్లాక్‌లు, హాస్ట‌ళ్ల‌ను ప‌రిశీలిస్తాన‌ని సీఎం తెలిపారు. యూనివ‌ర్సిటీ అభివృద్ది ప‌నుల‌కు సంబంధించి విద్యార్థులు, బోధ‌నా సిబ్బంది అభిప్రాయాలు స్వీక‌రించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. తొలుత అభివృద్ధి న‌మూనాలు వారి ముందు ఉంచాల‌ని.. త‌ర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌త్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. వారి అభిప్రాయాల‌కు ప్రాధాన్య‌మిస్తూ ఈ నెలాఖ‌రు నాటికి అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై తుది నిర్ణ‌యం ఖ‌రారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *