NewsInn

News in a Click

కేసిఆర్ కు సీఎం రేవంత్ కౌంట‌ర్

కేసిఆర్ కు సీఎం రేవంత్ కౌంట‌ర్

చిట్ చాట్ లో కేసిఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాకు కేసిఆర్ చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు……అసలు చంద్రబాబు శిష్యుడే కేసీఆర్….
పట్టిసీమను అభినందిస్తున్నానని అన్నదే కేసీఆర్….ఆయన తమలపాకుతో కొడితే నేను తలుపు కర్రతో కొడతా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసిఆర్ మీడియా స‌మాశంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతో ముఖ్య‌మంత్రి వెంట‌నే చిట్ చాట్ చేసి కేసిఆర్ కు కౌంట‌ర్ ఇచ్చారు. కేసిఆర్ వ‌య‌సుకు త‌గ్గ మాటలు మాట్లాడ‌డం లేద‌న్నారు . కేసిఆర్ పోవాల‌ని నేను కోరుకోవ‌డం లేద‌న్నారు. ఆయ‌న‌ కొడుకు, అల్లుడు దాన్నికోరుకుంటున్నార‌ని రేవంత్ వ్యాఖ్య‌లు చేశారు. కుర్చీ కోసం వారిద్ద‌రి మ‌ధ్య త‌గ‌దా న‌డుస్తుంద‌న్నారు.10 ఏళ్లలో కృష్ణా నదిపై రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టి లక్ష 80 కోట్ల బిల్లులు కేసిఆర్ ప్ర‌భుత్వం చెల్లించింద‌న్నారు. ఏపీ జ‌ల‌దోపిడికి స‌హ‌క‌రించిందే కేసిఆర్ అని రేవంత్ వ్యాఖ్యానించారు.

జూరాల దగ్గర ఓడిసి పట్టుకోవాల్సిన కృష్ణ జిల్లాలను శ్రీశైలం నుండి ఇచ్చి ఏపీకి రాసిచ్చిండన్నారు.కేసిఆర్ హయాంలోనే అత్యధిక జలదోపిడి జరిగిందని, మూడు జిల్లాకు మ‌ర‌ణ శాస‌నం రాసిందే కేసిఆర్ అని ఆరోపించారు.జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప‌థ‌కానికి కి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవన్నారు. రెండేళ్ల తర్వాత కలుగులో నుంచి కేసీఆర్‌ బయటకు వచ్చారని, ఓటమితో కేసీఆర్‌ మారతారని నేను ఆశించాను కానీ మళ్లీ అబద్ధాలే చెప్పారు.కృష్ణా జలాల్లో ఏపీకి 64 శాతం, తెలంగాణకు 36 శాతం చాలని సంతకం పెట్టిన ద్రోహి కేసీఆర్ అని ఆరోపించారు.జనవరి 2వ తేదీ నుంచి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తా ఈ స‌మావేశాల్లోనే కృష్ణా జ‌లాల‌పై చ‌ర్చ‌కు కేసిఆర్ రావాల‌ని రేవంత్ స‌వాల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *