రెండు రోజుల్లో మూడు అత్యాచారాలు….నెలకో వరకట్నం చావు
రాచకొండ పరిధిలో క్రైం తీరు
2025 క్రైమ్ వార్షిక నివేదికలో వెల్లడి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. పోలీసు రికార్డుల ప్రకారం గత ఏడాది28,626 కేసులు నమోదు కాగా ఈ 2025 లో ఇప్పటి వరకు 33,040 కేసులు నమోదైనట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో కిడ్నాప్, ఫోక్సో కేసులు సంఖ్య పెరిగింది. ఈ కేసులను సగటున పరిశీలిస్తే నగరంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళన కరంగా కనిపించక తప్పదు. సగటున ఒకటిన్నర రోజులకు ఒక కిడ్నాప్, రోజుకు రెండు బాల, బాలికలపై లైంగిక వేధింపులకు గురిచేసే నమోదు చేసే ఫోక్సో కేసులు నమోదవుతున్నాయి.కనీసం రోజుకు నాలుగు చోరీ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. హత్య, అత్యాచారం, దోపిడి ల వంటి కేసులను పరిశీలిస్తే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సగటున ఐదు రోజులకు ఒక మర్డర్ జరిగింది. ఏడాదిలో 79 హత్య కేసులు ఇక్కడ నమోదయ్యాయి.

అత్యాచారాల విషయానికి వస్తే 330 అత్యాచారం కేసులు నమోదు అయితే…. రెండు రోజుల్లో మూడు అత్యాచార కేసులు నమోదుయ్యయాని పోలీసు రికార్డులే చెబుతున్నాయి.2024లో 330 అత్యాచారం కేసులు పోలీసులు నమోదు చేశారు. కిడ్నాప్ కేసులు 579 నమోదు కాగా 1224 ఫోక్సో కేసులు నమోదయ్యాయి. సాధారణ చోరీల విషయానికి వస్తే 1,161 నమోదు అయ్యాయి.సగటున పరిలిస్తే రోజుకు ఐదు చోరీ ఘటనలు జరిగాయి. నెలకో వరకట్నపు చావు ఈ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యింది.మర్డర్ ఫర్ గెయిన్ కేసులు 3.. దోపిడీ 3, దొంగతనాలు 67, ఇళ్లలో చోరీ 589, వాహనాల చోరీలు 876, సాధారణ చోరీలు 1, 161, హత్యలు 73, అత్యాచారాలు 330, గృహ హింస కేసులు 782, గత ఏడాదితో పోలిస్తే మహిళ పై నేరాల సంఖ్య 4శాతం పెరిగినట్లు సైబరాబాద్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
డ్రగ్స్ కేసుల్లో… రోజుకు ఇద్దరు అరెస్టు
ఈఏడాది రాచకొండ పరిధిలో 20 కోట్లు విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.668 నిందితులను అరెస్టు చేశారు. 256కేసులను నమోదుచేశారు. డ్రగ్స్ కేసుల్లో 2090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లెట్లు, 34 కేజీల హ్యాష్ ఆయిల్ , 216 గ్రాముల MDMA , 10 కిలోల OPM, 242 గ్రాముల హెరాయిన్ , 35 కిలోల గసాగసల సామాగ్రి సీజ్ చేశారు. ఎక్సైజ్ యాక్ట్ కింద 656 కేసులు నమోదు , 689 మంది అరెస్ట్ , 6824 లీటర్ల మద్యం సీజ్ చేశారు

గేమింగ్ యాక్ట్ : 227 కేసులు నమోదు చేసిన పోలీసులు 1472 మంది అరెస్ట్ , 69 లక్షల ప్రాపర్టీ సీజ్
మానవ అక్రమా రవాణా : ఈ ఏడాది 73 కేసులు నమోదు, 8 అక్రమ రవాణా స్థావరాలను గుర్తించారు.
జైలు శిక్షలు : ఈ ఏడాది 5, 647 కేసుల్లో 146 మందికి జైలు శిక్ష ఖరారైంది. గత ఏడాది తో పోలిస్తే 74 శాతం నేరస్తులకు శిక్షలు పెరిగిన కన్విక్షన్ రేటు
ఎస్ ఓటీ : స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఈఏడాది 186 డ్రగ్స్ కేసుల్లో 356 మంది అరెస్ట్
సైబర్ క్రైమ్ : గత ఏడాది తో పోలిస్తే తగ్గిన సైబర్ క్రైమ్ కేసులు
గత ఏడాది 4618 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 3734 కేసులు నమోదయ్యాయి.
ఆపరేషన్ ముస్కాన్ కింద 2479 మంది ని రెస్క్యూ చేసిన పోలీసులు. ఆపరేషన్ స్మైల్ 1071 మంది రెస్క్యూ చేసిన పోలీసులు
గత ఏడాది తో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా ఈ ఏడాది పెరిగింది. 2024లో 3207 కేసులు నమోదు కాగా, ఈఏడాది 3488 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 659 మందిమృతి.. ORR పై జరిగిన ప్రమాదాల్లో 37 మంది మృతి చెందారని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అత్యధికంగా 17 ,760 కేసులు నమోదు చేశారు… డ్రంక్ డ్రైవ్ ద్వారా 3.89 కోట్లు జరిమానాలు పోలీసులు వసూలు చేశారు. 5821 లైసెన్స్ లు రద్దు అయినట్లు తెలిపారు.





Leave a Reply