(హైదరాబాద్,న్యూస్ఇన్)

గ్రేటర్ హైదరాబాద్ డివిజన్ల విభజనపై బీజెపి లీగల్ సెల్ హై కోర్టను ఆశ్రయించింది. ప్రభుత్వం తలపెట్టిన డిలీమిటేషన్ ప్రక్రియలో శాస్త్రీయత లోపించిందని బీజెపి ఆరోపిస్తున్న నేపథ్యంలో లీగల్ సెల్ హై కోర్టు కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.విభజనలో ప్రజాస్వామ్య సూత్రాల ఉల్లంఘన జరిగిందని బీజెపి ఆరోపిస్తోంది. ప్రజాభిప్రాయం, క్షేత్ర స్థాయిపరిస్థితులు, భౌగళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండానే ప్రభుత్వం వార్డుల విభజన ప్రక్రియ చేపట్టిందని పిటీషన్ లో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా డివిజన్ విభజన చేశారన్న లీగల్ సెల్ వాదిస్తోంది. ఈ ప్రక్రియను ఇదే విధంగా కొనసాగిస్తే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని బీజెపి పిటీషన్లో పేర్కొంది.విభజనపై వెంటనే స్టే విధించాలని కోర్టుకు అభ్యర్థించింది.




Leave a Reply