ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
అవినీతి నిరోధక శాఖ అధికారులుఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో మరో అవినీతి అధికారి నివాసంలో సోదాలు చేశారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్పై ఏసీబీ ఈ ఉదయం సోదాలు మొదలు పెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్పై ఏసీబీ కేసును నమోదు చేసింది.

కిషన్ నాయక్కు సంబంధించిన ఆస్తులపై హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హాయంలో రవాణా శాఖలో చక్రం తిప్పిన పాపారావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.






Leave a Reply