NewsInn

News in a Click

ఫుట్ బాల్ షోకులు…ర్యాంపు వాకులు… స‌మ్మిట్ లు

ఫుట్ బాల్ షోకులు…ర్యాంపు వాకులు… స‌మ్మిట్ లు

కేసిఆర్ ప్రెస్ మీట్ తో ప్ర‌భుత్వంలో అల‌జ‌డి

ప్ర‌భుత్వం బ్రోక‌ర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లింది

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఓ జోక్

మాజీ మంత్రి హ‌రీష్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

కృష్ణా జ‌లాల విష‌యంలో రాజుకున్న రాజ‌కీయ ర‌గ‌డ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. గులాబీ బాస్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన రోజు నుంచి కాంగ్రెస్ నేత‌లు అలెర్ట్ అయ్యారు. కేసిఆర్ తెర‌పైకి తెచ్చిన అంశాల‌ను ఖండిస్తున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌ను మ‌రింత ఇరుకున పెట్టే విధంగా గులాబీ పార్టీ పావులు క‌దుపుతోంది. మాజీ మంత్రి హ‌రీష్ రావ్ కృష్ణా జ‌లాల విష‌యంపై చ‌ర్చ‌కు సిద్దం అంటూ చెబుతూనే సీఎం వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు మ‌రింత ప్రాధ‌న్య‌తఇస్తున్నారు. తెలంగాణా భ‌వ‌న్ లో హ‌రీష్ రావ్ చిట్ చాట్ నిర్వ‌హించి ప్ర‌భుత్వ తీరును మ‌రోసారి ఎండ‌గ‌ట్టారు. ఈ సీఎం కు ఫుట్ బాల్ మ్యాచ్ లు అడే షోకులు, అందాల పోటీలు నిర్వ‌హించి ర్యాంపు వాకులు ఏర్పాటు చేసేందుకు దొరుకుతుంద‌ని ఎద్దేవా చేశారు. వీటిని నిర్వ‌హించినంత మాత్ర‌న పేద ప్ర‌జ‌ల క‌డుపు నిండ‌ద‌న్నారు. ఏ ముఖ్య‌మంత్రి కూడా రాత్రి 9.30 గంట‌ల‌కు చిట్ చాట్ చేసిన సంద‌ర్భాలు లేవ‌న్నారు. 4,000 మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో … కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని సీఎం చూస్తున్నార‌ని హ‌రీష్ చెప్పారు.సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే PPT ని స్వాగతిస్తున్నాం. కానీ వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్‌కు కూడా PPT ఇచ్చే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం మాకు కేటాయిస్తూ స‌భ‌లో మా గొంతు నొక్కుతున్నారన్నారు. ఇది ప్రభుత్వంలా లేదని, ఒక కన్సల్టెన్సీ కంపెనీ. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోందన్నారు. గ‌తంలో అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి రూ. 180 కోట్ల కమిషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ. 30 వేల కోట్ల అప్పు తేవాలని ప్ర‌భుత్వం చూస్తోంద‌ని హ‌రీష్ రావ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ. 7,000 కోట్లను ఉత్తమ్, భట్టిలు పంచుకున్నారని, 20% కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారన్నారు.తెలంగాణకు 45 టీఎంసీలు చాలని ఉత్తమ్ ఉత్త‌రం రాయడం చారిత్రక తప్పిదమ‌ని, దానికి క్షమాపణ చెప్పి, వెంటనే 90 టీఎంసీల కోసం మ‌రో లేఖ రాయాలన్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హ‌రీష్ రావ్ విమ‌ర్శించారు. అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. ఈ సిట్ (SIT) ఒక పెద్ద జోక్.రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులకు ఏపీలో అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది. రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తామ‌ని హెచ్చ‌రించారు. త‌న‌పై ఉద్య‌మ స‌మ‌యం నుంచి 300 కేసులు న‌మోద‌య్యాయ‌ని, కొత్త‌గా పెట్టే కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని హ‌రీష్ రావ్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *