NewsInn

News in a Click

బీఆర్ఎస్ నేత‌లు బ‌రితెగించారు… అన్నీ అబ‌ద్దాలే

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరుతో గ‌త ప్రభుత్వం 27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, బీఆర్ ఎస్ నేత‌లు బ‌రితెగించి అన్ని అబద్దాలే చెబుతున్నార‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి అనుమ‌తులు లేవ‌న్నారు. దీని నిర్మాణం కోసం త‌మ ప్ర‌భుత్వ హాయంలో ఇప్పి వ‌ర‌కు 7వేల కోట్ల రుపాయ‌లు వెచ్చించామ‌ని ఉత్త‌మ్ వెల్ల‌డించారు. కృష్ణా జ‌లాల్లో
45 టీఎంసీ కి ఒప్పుకున్నామ‌నేది అవాస్తవమ‌న్నారు.

కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు ప‌థ‌కాన్ని పూర్తి చేయాల‌నే ఉద్దేశ్యం లేక పోవ‌డంతోనే ఆ ప్రాజెక్టుపై దృష్టి పెట్ట‌లేద‌న్నారు. 2020లో సెంట్రల్ కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, SLBC, డిండి ప్రాజెక్టుకు నీళ్లు అడుగలేదని ఆరోపించారు.బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌దేళ్ల‌లో 1.83ల‌క్ష‌ల కోట్లు ఇరిగేష‌న్ కు వెచ్చించినా….ఒక్క ఎక‌రాకు సాగునీటిని అందివ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. ఏపీ ప్ర‌భుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ప్రారంభిస్తే…. ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారన్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో…… రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశామ‌ని చెప్పారు. రాబోయే మూడేళ్ల‌లో SLBC ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఉత్త‌మ్ కుమార్ పేర్కొన్నారు.అసెంబ్లీ నిబంధనల ప్రకారం నడుస్తుందని,PPT కి అవకాశం ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చామని చెప్తారా? అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *