
(అమరావతి,న్యూస్ఇన్)
దేశంలో తీవ్ర వాద భావ జాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఏర్పాటు చేసిన వారిని ఏపీ పోలీసులు ఆదుపులోకి తీసుకోవడంతో మరిన్ని ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నారు. కౌంటర్ ఇంటెలీజెన్స్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ కేసులో మొత్తం 12 మంది ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సోష్ ల్ మీడియా వేదికల ద్వారా తీవ్ర వాద భావజాలాన్న వ్యాప్తి చేసేందుకు అనుగుణంగా ఇన్స్టాగ్రాం వేదికగా రెండు గ్రూపులను IQIS, ISISల పేరుతో ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రూపులు ప్రాథమిక దశలోనే ఉండడంతో అతి తక్కువ మంది సభ్యులు మాత్రమే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఒక గ్రూపులో ఐదుగురు, మరోగ్రూపులో 7 గురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు ప్రకటన లో వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు కూడా విజయవాడకు చెందిన వారే అని అయితే గ్రూపుల్లో సభ్యులు మాత్రం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఐజీ త్రిపాఠి చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎంత మంది ప్రమేయం ఉందన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని త్రిపాఠి వెల్లడించారు. వీరంతా ఆన్ లైన్ ద్వారా తీవ్ర వాద జాలాన్ని వ్యాప్తి చేసి యువతను ఆకర్షించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. కేసులో పూర్తి వివరాలను రాబట్టేందుకు ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీసులు వెళ్లి వారిని కూడా అదపులోకి తీసుకుని విచారించనున్నట్లు ఐజీ త్రిపాఠి వెల్లడించారు.
విజయవాడలో కలకలం…..హైదరాబాద్ లింక్స్……

విజయవాడలో పోలీసులు తీవ్రవాద భావజ్వాల వ్యాప్తికోసం పనిచేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడంతో హైదరాబాద్ లింక్ కూడా బయట పడింది. హైదరాబాద్ చెందిన ఓ మహిళ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సౌదా బేగం అనే మహిళ ఈ ఉగ్ర కోణంలో కీలకపాత్ర అని పోలీసులు నిర్ధారించారు. ఈ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళను విచారిస్తే మరిన్ని పాతబస్తీ లింక్ లు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.




Leave a Reply