NewsInn

News in a Click

తిరుమ‌లలో ఆధునిక వంట‌శాల‌- రూ.120 కోట్ల విరాళం

తిరుమ‌లలో ఆధునిక వంట‌శాల‌- రూ.120 కోట్ల విరాళం

(తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌)

తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన వంటకాలను అందించే లక్ష్యంతో భారీ వంటశాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టింది. రిలయన్స్ సంస్థ సహకారంతో రూ. 120 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధునాతన వంటశాల నిర్మించనుంది. వంటశాలతో పాటు డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వంట విధానం, ప్రసాదాల పంపిణీని ఆటోమేషన్ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా టీటీడీ అన్నదానంలో మార్పులకు శ్రీకారం చుడుతోంది.

రిలయన్స్​ రూ.120 కోట్ల విరాళం….

కలియుగ వైకుంఠ నాథుడి దర్శనానికి ప్రపంచం నలుమూల నుంచి వచ్చే భక్తులకు నాలుగు దశాబ్ధాలుగా ఉచిత అన్నదాన వితరణ చేస్తున్నారు. అయితే సేవలను మరింత విస్తృతం చేయడానికి టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా తరిగొండ వెంకమాంబ అన్నవితరణ కేంద్రాన్ని ఆధునికీకరించడంతో పాటు విస్తరించడానికి చర్యలు చేపడుతోంది. ఒకేసారి నాలుగు వేల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా నిర్మించిన వెంగమాంబ అన్నదాన సత్రం భక్తుల రద్దీ పెరగడంతో ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ సంస్థ అన్నదాన సత్ర నిర్మాణానికి రూ. 120 కోట్లను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *