NewsInn

News in a Click

రవాణా శాఖలో ఖల్ నాయక్ ఆస్తుల కలకలం

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఏసీబీ దాడులతో రవాణా శాఖలోని ఖల్ నాయక్ ఆస్తుల వివరాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. సోదరులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ ఆస్తులు పోగేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని వెనకేసిన ఆస్తుల విలువ భారీగానే ఉందని అంచనా వేస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 400 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనాలు ఉన్నాయి

నోరెళ్ళబెట్టిన ఏసీబీ…

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో…. ఏసీబీ అధికారుల సోదాలు వెలుగు చూసిన వాస్తవాలు వారిని నోరేళ్లపెట్టేలా చేశాయి. రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న నాయక్ పలు జిల్లాల్లో స్థిర ఆస్తులు భారీగా కూడా బెట్టినట్లు గుర్తించారు.కోటి 37 లక్షల నగదుతో పాటు స్థిర ఆస్తులను ఏసీబీ గుర్తించింది.

నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని తెలిపిన ఏసీబీ డీజీ చారుసిన్హా

కిషన్ నాయక్ బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకుని, ఆయన ఆస్తులు రూ.400 కోట్ల రూపాయల విలువ చేసేవిగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *