NewsInn

News in a Click

ఆ కుటుంబానికి అధికారం ద‌క్క‌నివ్వ‌ను..సీఎం రేవంత్

ఆ కుటుంబానికి అధికారం ద‌క్క‌నివ్వ‌ను..సీఎం రేవంత్

2028లో అధికారం కాంగ్రెస్ దే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తాను రాజ‌కీయాల్లో ఉన్నంత కాలం క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అధికారం ద‌క్క‌నివ్వ‌న‌ని సీఏం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్ లో అత్మీయ స‌మ్మెళ‌నం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఘాటుగా స్పందించారు. మ‌ళ్లీ రాష్ట్రంలో క‌ల్వ‌కుంట్ల కుటంబానికి అధికారం ద‌క్క‌డం క‌లే అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి నిన్న మొన్న జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ పార్టీని ఓడించామ‌ని చెప్పారు.అసెంబ్లీ, పార్లమెంట్‌, ఉపఎన్నికలు.. అన్నింట్లోనూ ఓడించామ‌న్నారు. త్వ‌ర‌లో జ‌రిగే స‌మావేశాల‌కు కేసిఆర్ హాజ‌రైతే ఆయ‌న కోరిన‌న్ని రోజులు అసెంబ్లీ నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. ఏ అంశంపై నైనా అసెంబ్లీలో చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు.

ప‌దేళ్ల బీఆర్ ఎస్ పాల‌న‌లో పాల‌మూరును పూర్తిగా ఎండ‌బెట్టార‌ని ఆరోపించారు. కేసిఆర్ 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ జీవితం అంటారు…మాట్లాడే ప‌ద్ధ‌తి ఇదేనా అంటూ ప్ర‌శ్నించారు. తాను రాజ‌కీయాల్లోకి కింది స్థాయి నుంచి వ‌చ్చాన‌ని ఎవ‌రినీ దుబాయ్ పంపిస్తాన‌ని మోసం చేయాల‌న్నారు. కేసిఆర్ ప్ర‌భుత్వం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంచేస్తుంద‌ని ఆరోపిస్తే….. కొడుకు రియ‌ల్ ఎస్టేట్ కుప్ప‌కూలింద‌ని అంటారు. సొంత చెల్లికి స‌మాధానం చెప్ప‌లేని కేటిఆర్ త‌న‌కు స‌వాల్ విస‌ర‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కేసిఆర్ నువ్వెంత‌….నీ స్థాయి ఎంత అంటూ రేవంత్ కేసిఆర్, కేటిఆర్ ల‌పై ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు.

పంచాయ‌తీల‌కు అద‌న‌పు నిధులు…

గ్రామ పంచాయ‌తీల‌కు అద‌నంగా 5 నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తామ‌ని కోడంగ‌ల్ లో స‌ర్పంచ్ ల స‌మ్మెళ‌నంలో రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ్రామ‌ల అభివృద్ధి కోసం ఈ నిధుల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *