కాంగ్రెస్ను బొందపెట్టడం ఖాయం: కేటీఆర్

(హైదరాబాద్,న్యూస్ఇన్)
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోక….. సొంత జిల్లా ప్రజలనే మోసం చేస్తున్న చేస్తున్న రేవంత్ రెడ్డి, తన నిర్వాకం బయటపడటంతో తట్టుకోలేక అహంకారంతో అరుస్తున్నారని, దగుల్బాజీ కూతలు కూస్తున్నారని కేటిఆర్ సీఎం రేవంత్ పై మండి పడ్డారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి హక్కులపై రాజీపడ్డ విషయాన్ని బయటపెడితే సమాధానం చెప్పలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కడం రేవంత్ నైజమని కేటీఆర్ విమర్శించారు.తెలంగాణ సోయి లేని, రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు రేవంత్ రెడ్డిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం ఆయనకు అలవాటేనని మండిపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసక పాలనతో ప్రజలను చావగొడుతున్నారని, వికృత మనస్తత్వంతో చావులు కోరుకుంటున్న నీచమైన వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా ముఖ్యమంత్రికి బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగవని, అదే నీ స్థాయి అంటూ రేవంత్ రెడ్డి గతాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. పనికిమాలిన శపథాలు చేయడం, తీరా సమయం వచ్చాక పత్తా లేకుండా పారిపోవడం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.






Leave a Reply