NewsInn

News in a Click

2028లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతారు

2028లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతారు

రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి నిజాలు చెప్పే ద‌మ్ము లేక దివాళ‌కోరు రాజ‌కీయాలకు తెర‌లేపుతున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. వాద‌న‌లో బ‌లం లేన‌ప్పుడు. నిజం ఒప్పుకోలేకే వ్య‌క్తి గ‌త దూష‌ణ‌ల‌కు సిఎం రేవంత్ దిగుతున్నార‌ని హ‌రీష్ రావ్ అన్నారు. ఇచ్చిన హామీల అమలు పై ధ్యాస లేక‌,పాల‌న‌పై దృష్టి పెట్ట‌కుండా ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినపుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలే.
రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తున్నది.అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరు. 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *