NewsInn

News in a Click

చిన్నారుల‌ను అమ్ముకుంటున్న ముఠా !

చిన్నారుల‌ను అమ్ముకుంటున్న ముఠా !

అరెస్టు చేసిన పోలీసులు

న‌గ‌రంలో సంచ‌ల‌నం “సృష్టి”స్తున్న మ‌రో కేసు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

న‌గ‌రంలోని చిన్నారుల‌ను అమ్ముతున్న మ‌రో ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారుల‌ను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్ప‌టికే 15 మంది పిల్ల‌ల‌ను వివిధ చోట్ల విక్ర‌యించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. సైబ‌రాబాద్ ఎస్ ఓ టి పోలీసులు ఈ ముఠాలో 11 మందిని అరెస్టు చేశారు. ఆసుప‌త్రుల నుంచే ముఠా చిన్నారుల క్ర‌య విక్ర‌యాలను కొన‌సాగిస్తుంద‌ని పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లోని 8 ఆసుప‌త్రుల‌కు ఈ ముఠాలోని స‌భ్యులు ఎజెంట్లుగా ఉన్న‌ట్లు పోలీసు విచార‌ణ‌లో తెలింది. ఒక్కో శిశువును 15 ల‌క్ష‌ల రుపాయ‌ల వ‌ర‌కు ముఠా స‌భ్యులు అమ్ముతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు గురించి మాధాపూర్ పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మాదాపూర్ డీసీపీ రితిరాజ్……

మాదాపూర్, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాము

పిల్లలను విక్రయిస్తున్న 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసాము.

ఇందులో ఎనిమిది మహిళలు ఉన్నారు.. ముగ్గురు పురుషులు ఉన్నారు..

వారి వద్ద నుండి ఇద్దరు శిశువులను స్వాధీనం చేసుకున్నాము.

అహ్మదాబాద్ నుండి నిందితులు హర్ష రాయ్, దారం లక్ష్మీ బాబును కొనుగోలు చేసి తీసుకువచ్చారు

అహ్మదాబాద్ లోని లేబర్ క్యాంప్ నుండి బాబు కొనుగోలు చేసి తీసుకు వచ్చారు..

సిద్దిపేటలో ఒక బాబును కొనుగోలు చేసి తీసుకు వచ్చారు.

సిద్దిపేట నుండి తీసుకు వచ్చిన బాబు తల్లిదండ్రులను గుర్తించాము

ఈ గ్యాంగ్ లో నలుగురు పై చాలా కేసులు ఉన్నాయి

గంగాధర్ రెడ్డిపై 13, బాబు రెడ్డిపై రెండు, నాగలక్ష్మి, హర్షపై రెండు కేసులు ఉన్నాయి..

గంగాధర్ రెడ్డి వీర్య దాత, సరో గసి కోసం మహిళలను IVF సెంటర్లకు తీసుకు వస్తూ ఉంటాడు..

గ్యాంగ్ సభ్యులు పేద దంపతులను గుర్తించి వారికి డబ్బు ఆశ చూపించి వారి వద్ద పిల్లలను కొనుగోలు చేస్తున్నారు..

పేద దంపతులకు మూడు లక్షలు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు..

కొనుగోలు చేసిన పిల్లలను డిమాండ్ ఉన్నవారికీ విక్రయిస్తున్నారు..

నిందితులకు ఐవీఏఫ్ సెంటర్ లతో సంబంధాలు ఉన్నాయి..

అరెస్ట్ అయిన 11 మందిలో సృష్టి కేసుతో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయో లోతుగా దర్యాప్తు చేస్తాం..

గంగాధర్ రెడ్డి, హర్ష రాయ్, సంగీత ముగ్గురు సృష్టి కేసులో నిందితులుగా ఉన్నారు..

గోపాలపురం సృష్టి కేసులో రెండో నిందితురాలిగా ఉన్న సంగీత కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు..

దారం లక్ష్మీ,సంగీత, హర్ష రాయ్ ముగ్గురు శిశువులను కొనుగోలు చేసి తీసుకు వస్తారు..

గోపాలపురం పీఎస్ పరిధిలో సృష్టి కేసులో అరెస్ట్ అయిన నిందితులు బెయిల్ పై వచ్హి మళ్ళీ శిశువులను విక్రయిస్తు పట్టుబడ్డారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *