(హైదరాబాద్,న్యూస్ఇన్)
విస్తరించిన ఆన్ లైన్ సేవలతో గిగ్ వర్కర్లు కీలకంగా మారారు. తమ సమస్యల పరిష్కారం కోసం గిగ్ వర్కర్లు రెండు రోజులు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ప్రకటన విడుదల చేశారు.స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర ఈ-కామర్స్ మరియు అగ్రిగేటర్ కంపెనీలకు చెందిన డెలివరీ వర్కర్లు డిసెంబర్ 25 మరియు 31, 2025 తేదీల్లో అఖిల భారత సమ్మె నిర్వహించనున్నారని వెల్లడించారు..తగ్గుతున్న ఆదాయం, అసురక్షిత పని పరిస్థితులు, 10-నిమిషాల డెలివరీ ఒత్తిడి, ఐడీ బ్లాకింగ్, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.డెలివరీ వర్కర్లు ఎక్కువ గంటలు పనిచేస్తూ కూడా తగిన వేతనం, భద్రత, గౌరవం మరియు ఉద్యోగ భద్రత పొందడం లేదని వాపోయారు.గిగ్ వర్కర్ల హక్కులను రక్షించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.



ప్రధాన డిమాండ్లు…..
న్యాయమైన వేతనాలు మరియు ఇన్సెంటివ్స్
జీవితాలకు ప్రమాదకరమైన 10-నిమిషాల డెలివరీ విధానాల రద్దు
ఇష్టానుసార ఐడీ బ్లాకింగ్ నిలిపివేయాలి
సురక్షిత పరికరాలు మరియు ప్రమాద సహాయం
నిరంతర పని హామీ
గౌరవప్రదమైన వ్యవహారం
తప్పనిసరి విరామాలు
యాప్/టెక్నికల్ సమస్యలకు సరైన సహాయం
ఉద్యోగ భద్రత మరియు సామాజిక భద్రతా లాభాలు
గిగ్ వర్కర్ల హక్కులను రక్షించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.





Leave a Reply