(హైదరాబాద్,న్యూస్ఇన్)
నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించింది.నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.







Leave a Reply