మంత్రులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు
త్వరలో బండారం బయటపెడుతాం
(హైదరాబాద్,న్యూస్ ఇన్)

రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాష, నిస్ప్రుహలతో ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వారంతా త్వరలోనే ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతర్గత సమావేశాలు జరుపుతూ….ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మంత్రి వర్గంలో కొంత మంది మంత్రులు చట్టం లోని లొసుగులను ఆధారంగా చేసుకుని వేల కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారని సంజయ్ ఆరోపించారు. బీజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్న విషయానే తాను చెబుతున్నానన్నారు. ఇంటెలీజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై నివేదికలు తెప్పించుకుంటున్నామని త్వరలోనే వారి భాగోతం బయటపెడుతామన్నారు. కాంగ్రెస్ అవినీతిపై బీజెపి త్వరలో పోరాటం మొదలు పెడుతుందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాషపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సీఎం హోదాలో ఉంటూ అలాంటి భాష వాడడం తప్పని హితవు చెప్పారు. సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సీఎం వ్యాఖ్యలపై చర్చిస్తున్నరాన్నారు. ఇప్పటికైన సీఎం తన భాష మార్చకుంటే మంచిదన్నారు. తెలంగాణాకు కల్వకుంట్ల కుటుంబం పెద్ద శనిలా పట్టిందని ఆరోపించారు. ప్రజలు అందుకే ఆ కుటుంబానికి గుణపాఠం చెప్పారని సంజయ్ వ్యాఖ్యానించారు. కృష్ణ జలాల్లో తెలంగాణాకు కేసిఆర్ వల్లే అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కోటి రుపాయాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం 3 వేల 500 కోట్ల రుపాయలను రాష్ట్రానికి విడుదల చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టే ఆదాయంతో 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే… 9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణకు పరిమితం ఎందుకు చేశారని ప్రశ్నించారు.
తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా స్పీకర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.మేం అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ విమర్శలకే పరిమితం తప్ప పోరాటాలు చేయలేదన్నారు.పార్టీ గుర్తు లేకపోవడంవల్ల పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఏ పార్టీకి ఆపాదించలేమన్నారు.పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. రాష్ట్రంలో రోహింగ్యాలకు ఇండ్లు ఇస్తూ ఓటు బ్యాంకుగా చూస్తూ దేశ భద్రతను గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు.కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని విమర్శించారు.మజ్లిస్ తో అంటకాగుతున్న కాంగ్రెస్ కు ఓటేసినా మజ్లిస్ కు ఓటేసినట్లే అని,
ఖైరతాాబాద్ ఉప ఎన్నికల కోసం మేం ఎదురు చూస్తున్నాంమని బండి సంజయ్ చెప్పారు.





Leave a Reply