(అమరావతి,న్యూస్ ఇన్)

తిరుమలలో నెలకొన్న భారీ రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదిలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. 10 వేల రుపాయల తో శ్రీవారి దర్శనానికి టీటీడి శ్రీవాణి పేరుతో దర్శనాలు కల్పించాలనే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. భక్తుల రద్దీ, వైకుంఠ ఏకాదశి తదితర కారణాలతోతిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) లో ఈ అవకాశం లేదని టీటీడి వెల్లడించింది.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని భక్తులను టీటీడీ కోరుతుంది.






Leave a Reply