శరతులు వర్తిస్తాయి
మెత్తబడ్డ రాజాసింగ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అలక వహించి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మెత్త బడ్డారు. పార్టీలో చేరేందుకు ఇప్పుడు తలపులు కొడితే అప్పుడు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ జాతీయ నాయకులు తనను ఎప్పుడైన పార్టీలోకి ఆహ్వానిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు విడుదల చేసిన ప్రకటన ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది. కీలక నేతలు ఈ ప్రకటనపై పెద్దగా స్పందించక పోయినా పార్టీ క్యాడర్ లో ఈ విషయం చర్చకు దారి తీస్తోంది. పార్టీని వీడి వెళ్లిన రాజాసింగ్ బిజెపి జాతీయ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందన్న ధీమా వ్యక్తం చే|శారు. పార్టీని ఓ కుటుంబంగా పోలుస్తూ కుటుంబంలో ఉండే నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే, ముందుగానే లేదా తరువాత ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుంది.ఈరోజు కాకపోతే, రేపు నేను కూడా నా ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు చెప్పలేనన్నారు.నేను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడిని. ఢిల్లీ లేదా రాష్ట్ర ఉన్నతాధికారులు నన్ను పిలిచిన రోజు, నేను నా పార్టీకి తిరిగి వస్తాను అని ప్రకటించారు. కానీ ఇక్కడే మరో కిటుకు పెట్టారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో మాట్లాడేందుకు స్వేఛ్చ ఇవ్వాలి,ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గాలకు సంబంధించి నిర్ణయాలు అమలు చేసేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని మరో సారి డిమాండ్ చేశారు. . అప్పుడే మన పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు..ఈరోజు కాకపోదే రేపు నాకు ఢిల్లీలోని పార్టీ పెద్ద నాయకుల నుండి లేదా రాష్ట్రంలోని పెద్ద నాయకుల నుండి పిలుపు వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు అన్నారు. అయితే రాజసింగ్ కండిషన్స్ కు పార్టీ తలొగ్గుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం.



Leave a Reply