హాలిడే ఎఫెక్ట్
(హైదరాబాద్,న్యూస్ఇన్)

నెహ్రూ జూ పార్క్ కు జనం పోటెత్తారు. వరుస సెలవులతో ఈ ఏడాది ఒక్క రోజులోనే భారీ ఎత్తున సందర్శకులు వచ్చారు. క్రిస్మస్, సెలవుల ప్రభావంతో ఒక్క రోజులునే రికార్డు స్తాయిలో 23,440 మంది సందర్శకులు వచ్చారు. ఈ ఏడాదిలో ఇదే అత్యధికంగా ప్రజలు సందర్శించిన రోజుగా రికార్డుకు ఎక్కంది.హైదరాబాద్ జూలో వివిధ దేశాలకు చెందిన 199 రకాల వన్యప్రాణులు ఉన్నాయి. పెద్ద ఎత్తున సందర్శకులు వస్తుండంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు భధ్రతా సిబ్బందిని, వాలంటీర్లను నియమించి ఎవరికీ ఇలాంటి ఇబ్బందులు కాకుండా చూశారు. జూలో వన్య ప్రాణులను చూసిన ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేశారు.





Leave a Reply