ప్రజాపాలనలో సర్పంచ్ లు కీలకపాత్ర పోషించాలి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ప్రజా పాలనలో నూతన సర్పంచులు భాగస్వామ్యం కావాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.భువనగిరి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 968 గ్రామ పంచాయతీ నూతన సర్పంచులకు చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సరం,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సర్పంచులకు స్వీట్ బాక్సులు పంపించారు.తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రైజింగ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో నూతన సర్పంచులు తమవంతు పాత్ర పోషించాలని చామల కిరణ్ రెడ్డి స్పష్టం చేశారు.మాజీమంత్రి,బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డికి సైతం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్వీట్ బాక్స్ పంపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


Leave a Reply