నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది?
అప్పటి సీఎస్ సోమేష్ ను విచారించాలి
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
పోలీసులు కొత్త సంవ్సతరం, పండుగల సీజన్ లోనే డ్రగ్స్ పై వ్యాఖ్యలు చేస్తూ పాత కేసులను పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హాయంలో నమోదు చేసిన డ్రగ్స్ కేసు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.ఆ కేసులో విచారణ చేపట్టిన అధికారి అకున్ సబర్వాల్ ను అర్దాంతరంగా ప్రభుత్వం ఎందుకు తప్పించిందో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో సీఎ స్ గా ఉన్న సోమేష్ కుమార్ డ్రగ్స్ కేసు నీరు గారేందుకు పావులు కదిపారని సంజయ్ విమర్శించారు. సోమేష్ కుమార్ ను విచారించి ఈ కేసును ముందుగా కొలిక్కి తేవాలని బండి సంజయ్ సూచించారు.

కేసిఆర్ ఫ్యామిలీకి సంబంధాలు
కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలున్నాయని గతంలో జరిపిన విచారణ తేలిందని బండి సంజయ్ తేలిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ కేసులో పట్టుబడి నిందితులు ఆనాడు అకున్ టీం ఎదుట వాంగ్మూలమిచ్చారని, పేర్కొన్నారు. ఆ వాంగ్మూలంతో కూడిన ఆడియో, వీడియో రికార్డులు బయటకొస్తే తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని భయపడ్డ నాటి సీఎం కేసీఆర్ ఆకున్ సబర్వాల్ ను అర్దాంతరంగా డ్రగ్స్ కేసు బాధ్యతల నుండి తప్పించారని ఆరోపించారుఉ. అకున్ సబర్వాల్ సేకరించిన ఆధారాలు, ఆడియో, వీడియో రికార్డులు, స్టేట్ మెంట్లను సోమేశ్ కుమార్ తదుపరి విచారణ టీంకు అప్పగించలేదని, వాటిని కోర్టుకు స్వాధీనం చేయలేదన్నారు.

ఈగల్ టీం లీగల్ టీంకు అధికారులున్నాయా
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ది ఉంటే సీఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘‘ఈగల్’’ టీం వెంటనే రంగంలోకి దిగి సోమేశ్ కుమార్ ను విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈగల్ టీం విచారణ తీరుపైనా ఈ సందర్భంగా బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈగల్ టీంకు నిజంగా లీగల్ గా అధికారాలున్నాయా? అని ప్రశ్నించారు. ఈగల్ టీంలో సమర్ధులైన అధికారులు ఉన్నప్పటికీ, ఒకరిద్దరు అధికారులు మాత్రం డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని తెలిపారు. నిన్నటి ఈగల్ టీం దాడిలో పెడ్లర్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు.



Leave a Reply